10 వేలకు చేరువలో కరోనా మృతులు: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుక్షణం ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నారు. కరోనా మృతుల సంఖ్య 10వేలకు చేరుకోబోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు 16 లక్షల మంది వైరస్ నిర్థారణ పరీక్షలు జరిగినట్లు ఆయన తెలిపారు. ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలని, సామాజిక దూరం పాటించాలని ఆయన మరోసారి గుర్తు చేశారు. 9/11 ఉగ్రదాడిని మించి కరోనా మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఒక్కరోజే 1,188 మంది కరోనా కారణంగా మరణించారు. కొత్తగా మరో 23 వేల మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. వైద్య పరికరాలను, రక్షణ సాధనాలను తెప్పించే ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపారు. అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో ఈ సంక్షోభాన్ని భారీ విపత్తుగా ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com