నిర్మాత ఇద్దరు కూతుళ్లకీ కరోనా..

ఇప్పటికే ఒక కుమార్తెకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తాజాగా ఆయన రెండో కుమార్తె కూడా ఈ వైరస్ బారిన పడింది. ఈ విషయం బాలీవుడ్ నిర్మాత కరీమ్ మొరానీని కరోనా కలవరపెడుతోంది. పెద్ద కుమార్తె షాజా మార్చి మొదటి వారంలో శ్రీలంక నుంచి ఇండియాకు వచ్చింది. అయితే ఆమెకు వైరస్ లక్షణాలు ఏవీ కనిపించకపోయినా టెస్ట్లు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆమెకు చికిత్స అందించి గృహ నిర్భంధంలో ఉంచారు. ఇక కరీమ్ రెండవ కుమార్తె జోవా 15 రోజుల కిందట రాజస్థాన్ నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. ఆమెకు కూడా కరోనా సోకినట్లు తెలియడంతో ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇలా ఒకే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులకు పాజిటివ్ అని తేలడంతో కుటుంబంలోని ప్రతిఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అందరూ క్వారంటైన్లో ఉంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com