ఏపీలో 348 కి పెరిగిన కరోనా వైరస్ కేసులు

ఏపీలో 348 కి పెరిగిన కరోనా వైరస్ కేసులు

ఏపీలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తోంది.. రాష్ట్రంలో బుధవారం ఉదయం 9 నుంచి జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో కొత్తగా గుంటూరు లో 8, అనంతపూర్ లో 7, ప్రకాశం 3, పశ్చిమ గోదావరి లో ఒక్క కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 19 కేసులతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 348 కి పెరిగింది.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వైద్య శాఖా ఈ వివరాలను వెల్లడించింది. జిల్లాల వారీగా చూసుకుంటే.. విశాఖపట్నం 20, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి 22, కృష్ణా 35, గుంటూరు 49, ప్రకాశం 27, నెల్లూరు 48, కడప 28, కర్నూల్ 75, చిత్తూరు 20, అనంతపురం 13 గా నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story