మాస్క్ లేకుండా వస్తే.. జైలు శిక్షే
By - TV5 Telugu |9 April 2020 8:04 PM GMT
కేజ్రీవాల్ ప్రభుత్వం కరోనాని కట్టడి చేసేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటుంది. ముఖానికి మాస్కులు ధరించకుండా రోడ్డుపైకి వచ్చే వారికి గరిష్టంగా ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వం కరోనాని కట్టడి చేసేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటుంది. ఎటువంటి రక్షణ కవచాలు ధరించకుండా రోడ్డుపైకి చర్యలు తప్పవని చీఫ్ సెక్రటరీ విజయ్ దేవ్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన వారికి గరిష్టంగా ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ. 200 నుంచి రూ. 1000 వరకు జరిమానా కూడా విధించనున్నట్టు తెలిపారు. మాస్కులు ధరించకుండా అధికారులు మీటింగులు నిర్వహించకూడదని సూచించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com