ఏపీలో 420కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

ఏపీలో 420కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. నిత్యం పదికి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. శనివారం రాత్రి 9 గంటలనుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకూ జరిపిన పరీక్షల్లో కొత్తగా 15 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 420 కి చేరింది. కొత్తగా గుంటూరు లో 7, నెల్లూరు లో 4, కర్నూల్ లో 2, చిత్తూరు మరియు కడప జిల్లాలో ఒక్కొక కేసు నమోదయ్యాయి.

కొత్తగా నమోదైన 15 కేసుల తో రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 420 కి పెరిగింది. ఇక పాజిటివ్ కేసులలో గుంటూరు, కర్నూలు జిల్లాలు పోటీ పడుతున్నాయి. కరోనూల్ జిల్లాలో అత్యధికంగా 84 పాజిటివ్ కేసులు నమోదసు కాగా గుంటూరు జిల్లాలో 82 కేసులు నమోదు అయ్యాయి. ఇక నెల్లూరు జిల్లాలో 52 కు చేరాయి.. ప్రకాశంలో 41 , కృష్ణా జిల్లాలో 35 , కడప జిల్లాలో 31 , పచ్చిమగోదావరి జిల్లాలో 22 , చిత్తూరు జిల్లాలో 21 , తూర్పు గోదావరి జిల్లాలో 17 , విశాఖ జిల్లాలో 20 , అనంతపురం జిల్లాలో 15 కేసులు నమోదు అయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story