కేంద్ర మాజీ మంత్రి రాజశేఖరన్ కన్నుమూత
By - TV5 Telugu |13 April 2020 6:54 AM GMT
ప్రముఖ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎం.వి.రాజశేఖరన్ సోమవారం బెంగళూరులోని ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 91. ఆయన గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత వ్యాధుల నుండి బాధపడుతున్నారు. ఆయనకు భార్య గిరిజా రాజశేఖరన్, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన 1928 సెప్టెంబర్ 12 న రామనగర జిల్లాలోని మరలవాడిలో జన్మించారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. ఎంఎల్సి, ఎంపి, కేంద్ర మంత్రిగా పనిచేసిన రాజశేఖరన్ వినయం తోపాటు గొప్ప పరిపక్వత కలిగిన రాజకీయ నాయకుడని ముఖ్యమంత్రి బిఎస్ యెడియరప్ప అన్నారు. రాజశేఖరన్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని అన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com