ఏపీలో 473 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
By - TV5 Telugu |14 April 2020 1:29 PM GMT
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.. తాజాగా రాష్ట్రంలో మరో 34 కేసులు నమోదయ్యాయి. సోమవారం సాయంత్రం 5 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో గుంటూరు లో 16, కృష్ణ లో 8, కర్నూల్ లో 7, అనంతపూర్ లో 2 మరియు నెల్లూరు లో ఒక కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 34 కేసుల తో రాష్ట్రం లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 473 కి పెరిగింది. ఇక జిల్లాల వారీగా కేసుల సంఖ్య ఇలా ఉన్నాయి. అనంతపురం 17, చిత్తూరు 23, కడప 31, కర్నూల్ 91, ప్రకాశం 42, నెల్లూరు 56, గుంటూరు 109, కృష్ణా44 , పశ్చిమ గోదావరి 23, తూర్పు గోదావరి 17, విశాఖపట్నం 20 గా ఉన్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com