చైనాకు సారీ చెప్పిన మెక్డొనాల్డ్స్
By - TV5 Telugu |14 April 2020 10:47 PM GMT
చైనాలో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. అక్కడ కొవిడ్ కేసులు విపరీతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నల్లజాతీయులను రెస్టారెంట్లోకి అనుమతించవద్దని అమెరికా కంపెనీ మెక్ డొనాల్డ్స్ నిర్ణయించింది. దక్షిణ చైనాలోని మెక్ డొనాల్డ్స్ బ్రాంచ్ లో ఆఫ్రికా ప్రజలను నిషేదించడం పట్ల చైనాలో వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో మెక్ డొనాల్డ్స్ చైనాకు క్షమాపణలు చెప్పింది. ఆఫ్రికన్ల పట్ల వివక్షపూరితంగా ప్రవర్తించినట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో చైనాకు, నల్లజాతీయులకు మెక్డొనాల్డ్స్ క్షమాపణలు తెలిపింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com