గుంటూరులో ప్రభుత్వ వైద్యురాలికి కరోనా పాజిటివ్‌

గుంటూరులో ప్రభుత్వ వైద్యురాలికి కరోనా పాజిటివ్‌
X

ఏపీలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తిచెందుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో పని చేస్తున్న ప్రభుత్వ వైద్యురాలికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ డాక్టర్ గుంటూరు సిటీలోని గోరంట్ల ఫీవర్‌ హాస్పిటల్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే సదరు డాక్టర్.. బ్రాడీపేటలోని వర్కింగ్‌ లేడిస్‌ హాస్టల్‌లో ఉంటున్నారు. వైద్యురాలికి కరోనా పాజిటివ్‌ అని బుధవారం నిర్ధారణ కావటంతో హాస్టల్‌లో ఉన్న మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story