పాక్ లో కరోనా విజృంభణ

X
By - TV5 Telugu |16 April 2020 5:51 PM IST
పాకిస్థాన్ లో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పాక్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,297 కు చేరుకుందని డాన్ న్యూస్ పేర్కొంది. ఈ న్యూస్ ఏజన్సీ కథనం ప్రకారం ఈ కేసులలో ఎక్కువగా పంజాబ్ ప్రావిన్స్ నుండి 3,168 నమోదు కాగా.. సింధ్ ప్రావిన్స్ నుండి 1,688 కేసులు నమోదయ్యాయి. ఖైబర్ పఖ్తున్ఖ్వాలో 47 కొత్త కేసులు వచ్చాయి. అయితే ఇందులో ఎక్కువగా తబ్లిఘి జమాత్కు చెందినవారు ఉన్నారు. అలాగే బెలూచిస్తాన్ ప్రావిన్స్ గవర్నర్ వెల్లడించిన వివరాల ప్రకారం, బెలూచిస్తాన్ లో మొత్తం 281 కేసులు నమోదయ్యాయి. ఇదిలావుంటే దేశవ్యాప్తంగా వైరస్ భారిన పడి 117 మంది మరణించారు. 1,446 మంది వైరస్ నుండి కోలుకున్నారని పేర్కొంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com