కరోనా సమయంలో నిరుపేదలకు అండగా నిలిచిన టీవీ5

X
By - TV5 Telugu |17 April 2020 2:13 PM IST
కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు tv5 అండగా నిలిచింది. కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం రామచంద్రపురం గ్రామంలో కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన సుమారు 250 కుటుంబాలకు tv5 ఆధ్వర్యంలో ఆరు రకాల కూరగాయలు పంపిణీచేశారు. విస్సన్నపేట తహశీల్ధార్ మురళీకృష్ణ చేతులమీదుగా కూరగాయల పంపిణి జరిగింది. ఈ కార్యక్రమంలో పాస్టర్ జాయ్సల్మాన్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా tv5 యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు రామచంద్రపురం గ్రామస్థులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com