వరి పొలంలో భారీ మొసలి.. పరుగులు తీసిన కూలీలు

X
By - TV5 Telugu |18 April 2020 12:17 AM IST
వరి పొలంలో భారీ మొసలి ప్రత్యక్షం అయింది. దీంతో భయాందోళనకు గురైన కూలీలు పొలం నుంచి పరుగులు తీశారు. నల్లగొండ జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. తిరుమలగిరి సాగర్ మండలంలోని నేతాపురం గ్రామంలో ఓ రైతు వరి పొలంలో కూలీలు వరి కోస్తున్నారు. వరి కోసే క్రమంలో కూలీలకు ఒక్కసారిగా పొలంలో మొసలి కనిపించింది. దీంతో షాకైనా కూలీలు అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు మొసలిని నాగార్జునసాగర్ రిజర్వాయర్లో వదిలారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com