26 మంది నేవీ సిబ్బందికి కరోనా

దేశంలో కరోనా వైరస్ కేసులు మోజు రోజుకు పెరుగుతున్నాయి. వీరిలో కొంతమంది వైద్య సిబ్బంది, భద్రతా సిబ్బందికి చెందిన వాయు మహమ్మారి భారిన పడ్డారు. తాజాగా భారత నావికాదళానికి చెందిన 26 మంది సిబ్బందికి ముంబైలోని నావికాదళ ప్రాంగణంలో కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది . ఐఎన్ఎస్ ఆంగ్రే పరిసరప్రాంతాల్లో ఉన్న వారందరికీ కోవిడ్ పరీక్షలు జరిపినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ విషయాలను రక్షణశాఖమంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర ఉన్నతాధికారులకీ తెలియజేశారనీ, వారు ఈ పరిస్థితిపై దృష్టిపెట్టినట్టు అధికారులు వెల్లడించారు.
ఇక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకారం, శనివారం రాత్రి 9 గంటల నాటికి, భారతదేశం మొత్తం 2,154 కొత్త కోవిడ్ -19 కేసులను నివేదించింది. ఏప్రిల్ 18, రాత్రి 9 నాటికి 3,54,969 మంది వ్యక్తుల నుండి మొత్తం 3,72,123 నమూనాలను పరీక్షించినట్లు ఐసిఎంఆర్ తెలిపింది. శనివారం మొత్తం 35,494 నమూనాలను నివేదించినట్లు తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com