ఏపీలో ఒక్కరోజే 31 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో ఒక్కరోజే 31 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి. శనివారం ఒక్కరోజే 31 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 603కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో కృష్ణాలో 18, కర్నూలు 5, నెల్లూరు 3, ప్రకాశం 2, తూర్పు గోదావరిలో 2, పశ్చిమ గోదావరిలో ఒక కేసు నమోదయినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి కరోనా బారిన పడి 16 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags

Read MoreRead Less
Next Story