మరో నాలుగు వారాలు లాక్‌డౌన్ పొడిగించిన సింగపూర్ ప్రభుత్వం

మరో నాలుగు వారాలు లాక్‌డౌన్ పొడిగించిన సింగపూర్ ప్రభుత్వం

కరోనాపై పోరాటంలో సింగపూర్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌ డౌన్ జూన్ ఒకటి వరకు కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో అక్కడ అన్ని వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు జూన్ ఒకటి వరకు మూసేఉంటాయి.

ఇప్పటివరకు సింగపూర్ లో 9125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎక్కువ కేసులు వలస కూలీలా ద్వారా నమోదవుతున్నాయని అక్కడి ప్రభుత్వం తెలిపింది. సింగపూర్‌లో ప్రస్తుతం రోజుకు సుమారు వెయ్యి కేసులు నమోదవుతున్నాయి. దీంతో మే 4 తో పూర్తి కావలసిన లాక్‌డౌన్ మరో నాలుగు వారల పాటు పొడిగించారు.

Read MoreRead Less
Next Story