కరోనా: శ్రీలంకలో ఎన్నికలు వాయిదా

కరోనా: శ్రీలంకలో ఎన్నికలు వాయిదా

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. అనేక దేశాలు పలు అధికారిక కార్యక్రమాలు వాయిదా వేసుకుంటూన్నాయి. తాజాగా శ్రీ లంక పార్లమెంటు ఎన్నికలను 2 నెలలు వాయిదా వేసుకుంది. ఈ మేరకు ఆ దేశ ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు 295 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏడుగురిని కరోనా పొట్టన పెట్టుకుంది. దీంతో ఈ నెల 25న జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి.

కాగా.. టోక్యో లో జరగాల్సిన ఒలింపిక్స్ కూడా వాయిదా పడ్డాయి. అటు భారత్ లో పలు రాష్ట్రాల్లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా పదిన సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story