ఉత్తరప్రదేశ్ లో పోలీసులపై రాళ్ల దాడి

ఉత్తరప్రదేశ్ లో పోలీసులపై రాళ్ల దాడి

లాక్‌డౌన్‌ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై రాళ్ల దాడి జరిగిన దురదృష్టకర ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్‌లో చోటుచేసుకుంది. ఈ దాడుల్లో ఒక పోలీస్ తీవ్రంగా గాయపడ్డాడు.

లాక్‌డౌన్‌ కారణంగా అలీగఢ్ లోని భుజ్‌పురాలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మార్కెట్ తెరవడానికి అక్కడి అధికారులు అనుమతి ఇచ్చారు. అయితే సమయం ముగియగానే మార్కెట్ మూసివేయమని పోలీసులు కోరారు. దీంతో పోలీసులు, దుకాణదారుల మధ్య గొడవ జరిగి.. కొంత మంది పోలీసులపై రాళ్ళు విసరి దాడి చేశారు. అయితే పరిస్థితిని అదుపు తప్పటంతో మరిన్ని పోలీసు బలగాలు, మునిసిపల్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. దీంతో అల్లరి మూకలు అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఘటనలో ఒక పోలీసు గాయపడ్డాడు.

Tags

Read MoreRead Less
Next Story