కరోనా కారణంగా ఒకేరోజు 431 కేసులు.. 18 మంది మృతి
By - TV5 Telugu |22 April 2020 11:32 PM GMT
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. అటు రాష్ట్రంలో ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా వేగంగా పెరుగుతుంది. కరోనా కారణంగా బుధవారం ఒక్కరోజే 18 మంది మృతి చెందారు. ఇక ఒక్క రోజులోనే రాష్ట్రంలో 431 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మహరాష్ట్రలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,649కి చేరింది. ఇప్పటి వరకు కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 269కి చేరింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com