ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోద ముద్ర..

ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోద ముద్ర..
X

ఆరోగ్య కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. వెంటనే గెజిట్‌ నోటిఫికేషన్ కూడా‌ విడుదల చేశారు. దీంతో తక్షణమే ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం మామూలు దాడులకు రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు జరిమానా లేదా మూడు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. తీవ్ర దాడి జరిగి, బాధితులకు గాయాలు అయితే గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా ఉంటుంది.

Tags

Next Story