పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచిన అసోం సర్కార్
ఓ వైపు అసోంలో ప్రజలు కరోనా మహమ్మారితో గజగజ వణికిపోతుంటే.. మరో వైపు ప్రభుత్వం వాహనదారులకు ఝలక్ ఇచ్చింది. ఒక్కసారిగా పెట్రోల్ డీజిల్ ధరలను భారీగా పెంచింది. పెట్రోల్ లీటరుకు రూ.6, డీజిల్ రూ.5 పెంచుతున్నట్లు అసోం ఆర్థికమంత్రి హిమంత బిస్వశర్మ ప్రకటించారు. దీంతో పెట్రోల్ రేటు రూ.71.61 నుంచి రూ.77.46కు పెరిగింది. అలాగే డీజిల్ రూ. 65.07 నుంచి రూ.70.50కి పెరిగింది. ఏప్రిల్ 22 అర్ధరాత్రి నుంచి ఈ కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి.
రాష్ట్ర ఆదాయాన్ని కాపాడేందుకే ఈ చర్య చేపట్టినట్టు ఆర్థికమంత్రి హిమంత బిస్వశర్మ వివరించారు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా పెద్దగా వాహనాలు నడపడం లేదు కనుక దీని ప్రబావం ప్రజలపై ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇది తాత్కాలికమేనని, పరిస్థితులు అనుకూలిస్తే ధరలను తగ్గిస్తామని బిస్వశర్మ తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com