చైనా వస్తువులను నిషేధించాలని ఉద్యమిస్తున్న స్వదేశీ జాగరణ్ మంచ్ సంస్థ

X
చైనా వస్తువులను వాడటం నిషేధించాలని ఆదివారం నుంచి ఓ ఉద్యమంగా నిర్వహిస్తామని స్వదేశీ జాగరణ్ మంచ్ సంస్థ ప్రకటించింది. చైనా వస్తువులను బహిష్కరించాలన్నది ఈ సంస్థ మూల సూత్రాలలో ఒకటిగా ఉంది. అయితే.. తాజాగా పరిస్థితుల నేపథ్యంలో ఈ సంస్థ ఈ ఉద్యమాన్ని ఉదృతం చేయడానికి నిర్ణయించింది. ఏప్రిల్ 25 ను అందరూ ‘స్వదేశీ సంకల్ప్ దివస్’గా జరుపుకోవాలని ఆ సంస్థ పిలుపునిచ్చింది.
ఏప్రిల్ 25న తమ ఇళ్లలో సాయంత్రం 6:30 నుంచి 6:40 వరకూ దీపాలు వెలిగించి, చైనా వస్తువులను బహిష్కరిస్తున్నట్లు ప్రతిజ్ఞ చేయాలని స్వదేశీ జాగరణ్ మంచ్ కో కన్వీనర్ అశ్వనీ మహజన్ తెలిపారు. చైనా సృష్టించిన కరోనా వైరస్ వల్ల ప్రపంచ ఆర్థిక రంగం కూడా బాగా కుదేలైందని అశ్వనీ మహజన్ మండిపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
