తొమ్మిదేళ్ళ తర్వాత సింగిల్డేలో జేకే పేపర్ భారీ లాభం

X
By - TV5 Telugu |28 April 2020 12:51 AM IST
జేకే పేపర్లో జోషన్ కొనసాగుతోంది. నిఫ్టీ-500 ఇండెక్స్లో టాప్ గెయినర్గా జేకే పేపర్ నిలిచింది. ఇంట్రాడేలో 15 శాతం లాభపడిన ఈ షేర్ డే గరిష్ట స్థాయి రూ.105కు చేరింది. మార్చి 30, 2011 తర్వాత సింగిల్ డేలో ఈ స్థాయిలో లాభపడటం జేకే పేపర్కు ఇదే తొలిసారి. ఇదే సమయంలో ఈ స్టాక్ వాల్యూమ్స్ కూడా భారీగా పెరిగాయి. 30 రోజుల సగటుతో పోలిస్తే జేకే పేపర్ వాల్యూమ్స్ 3.1 రెట్లు ఎగబాకాయి.
వాల్యూమ్స్ అనూహ్యంగా పెరగడంతో సోమవారం షేర్ 2 నెలల గరిష్ట స్థాయికి చేరింది. గత నెల 24న 52 వారాల కనిష్ట స్థాయి రూ.62కి పడిపోయిన జేకే పేపర్ ఆ తర్వాత ఒక్కసారిగా కోలుకుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com