కోటిన్నర లీటర్ల బీరు డ్రైనేజీపాలు.. విలవిలలాడిపోతున్న మందుబాబులు!

కోటిన్నర లీటర్ల బీరు డ్రైనేజీపాలు.. విలవిలలాడిపోతున్న మందుబాబులు!

దేశంలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. కరోనాని కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించి అమలు చేస్తోంది. ఈ లాక్ డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మద్యం షాపులు బంద్ అయ్యాయి. దీంతో మద్యం దొరక్క మందుబాబులు విలవిలలాడిపోతున్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. లాక్ డౌన్ వేళ మందుబాబుల కష్టాలు అంత ఇంత కాదు. అసలే మద్యం దొరక్క బాధ పడుతుంటే.. కోటిన్నర లీటర్ల బీరు డ్రైనేజీపాలు అవుతుందనే వార్త తెలిసి మందుబాబులు తెగ ఫీల్ అయిపోతున్నారు. అయ్యో అయ్యో అని గుండెలు బాదుకుంటున్నారు. అసలు ఇన్ని లీటర్ల బీరు అలా నేలపాలు కావడానికి కారణం ఏంటంటే లాక్ డౌన్.

అవును లాక్‌డౌన్‌తో అమ్మకాల్లేకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా కోటిన్నర లీటర్ల బీరు డ్రైనేజీపాలు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే, బీరు తయారైన తేదీ నుంచి సుమారు ఆరు నెలల పాటు వినియోగించుకోవచ్చు. ఈ లెక్కన చూస్తే రాష్ట్రవ్యాప్తంగా బీర్లు తయారుచేసే బేవరేజెస్‌ సంస్థలు, ఎక్సైజ్‌ డిపోలు, వైన్‌షాపులు, బార్లలో సుమారు 20 లక్షల కాటన్ల బీరు నిల్వ ఉన్నట్టు తెలుస్తోంది. లీటర్ల లెక్కన తీసుకుంటే సుమారు కోటిన్నర లీటర్ల బీరు గడువు తీరిపో వడంతో వినియోగానికి పనికిరాకుండా పోతోందని ఆబ్కారీ శాఖ లెక్కలు వేస్తోంది.

నిజానికి బీర్ల ఉత్పత్తి మార్చి నెలాఖరు నుంచే పలు బేవరేజెస్‌లో నిలిచిపోయింది. అప్పటికే తయారుచేసిన స్టాకు పలు బా ట్లింగ్‌ యూనిట్లు, ఆబ్కారీ డిపోలు, బార్లు, వై న్స్, క్లబ్‌లలో నిల్వ ఉంది. ఇందులో 6నెలల గడువు తీరిన స్టాక్‌ 20 లక్షల కాటన్ల మేర ఉంటుందని అంచనా. ఒక్కో కాటన్‌లో 12 బీర్లు ఉంటాయి. ఒక్కో సీసాలో 650 మి.లీ బీరు ఉంటుంది. ఈ లెక్కన సుమారు 1.56 కోట్ల లీటర్ల బీరుకు గడువు తీరిపోయిందని ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు. దీనిని అనివార్యంగా డ్రైనేజీ పాలు చేయాల్సిందేనని అంటున్నారు. ఈ వార్త తెలిసి మందుబాబులు తెగ ఫీల్ అయిపోతున్నారు.

Tags

Next Story