సిరియాలో బాంబు దాడి.. 40 మంది మృతి
By - TV5 Telugu |29 April 2020 12:09 PM GMT
సిరియాలో ఘోరం జరిగింది. ఉత్తర సిరియా పట్టణమైన ఆఫ్రిన్లో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు ట్రక్ బాంబు పేల్చడంతో. దీంతో 11 మంది పిల్లలతో సహా 40 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు, సమాచారం అందుకున్న భద్రతా, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించింది. ఈ ఘటనకు సిరియా కుర్దిష్ వైపిజి మిలీషియా సంస్థే కారణమని టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆఫ్రిన్ లో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో పేలుడు సంభవించిందని మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇది పరికిపంద చర్య అని వ్యాఖ్యానించింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com