రెండు వారాలు లాక్డౌన్ పొడిగించిన పంజాబ్

X
By - TV5 Telugu |29 April 2020 11:41 PM IST
మే 17 వరకూ లాక్డౌన్ పొడిగిస్తూ.. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మే 3తో దేశవ్యాప్తంగా లాక్డౌన్ రెండో దశ ముగుస్తుంది. కానీ, కరోనాను కట్టడి చేయాలంటే.. మరిన్ని రోజులు లాక్ డౌన్ పొడిగించాలని కొన్ని రాష్ట్రాలు భావిస్తున్నాయి.
రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ప్రధానికి కూడా పలువురు ఇదే విషయాన్ని సూచించారు. మే 2న జాతినుద్దేశించి ప్రశంగించనున్న ప్రధాని మోడీ కూడా లాక్డాన్ కొనసాగింపుపై కీలక ప్రకటన చేస్తారని అంచనా వేస్తున్నారు. అయితే.. లాక్ డౌన్ పొడగింపుపై ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ప్రకటించాయి. తాజాగా పంజాబ్ రెండువారాలు లాక్ డౌన్ పొడిగిస్తూ.. నిర్ణయం తీసుకుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com