వెయ్యి రూపాయలకే కరోనా వ్యాక్సిన్!

X
By - TV5 Telugu |30 April 2020 12:04 AM IST
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఈ మహమ్మారిని తరిమి కొట్టే వ్యాక్సిన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అయితే వెయ్యి రూపాయలకే కొవిడ్-19 వ్యాక్సిన్ను విక్రయిస్తామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదార్ పూనావాలా ప్రకటించారు.సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి రెండు నుంచి నాలుగు కోట్ల డోసులను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మేలో హ్యూమన్ ట్రయల్స్ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com