ఆ రెండు రాష్ట్రాలకు వెళ్లొద్దు: తెలంగాణ ప్రభుత్వం

X
By - TV5 Telugu |1 May 2020 6:45 PM IST
ఏపీ, మహారాష్ట ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆప్రాంతాలకు వెళ్లొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది తెలంగాణ సర్కారు. అక్కడ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నందున ఈ చర్య తీసుకుంది. సరిహద్దుల్లోని ప్రాంతాల ప్రజలు వైద్యం లాంటి అత్యవసర పనులకు కూడా వెళ్లవద్దని ప్రకటించింది. ఈ రూల్ కచ్చితంగా అందరూ పాటించేలా పోలీసు బలగాలను పెంచింది. ఏపీలోని కర్నూలులో కరోనా కేసులు ఎక్కువగా నమోదవడం.. అక్కడికి గద్వాల, మహబూబ్నగర్ జిల్లాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో నిషేధం విధించింది. అలాగే ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన వారు విజయవాడ, గుంటూరు వైపు వెళ్లడానికి కూడా వీలు లేదు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com