జాతినుద్దేశించి మోదీ ప్రసంగిస్తారని భావించిన ప్రజలు.. కానీ, ప్రధాని చేసిన ఆసక్తికర ట్వీట్

జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారని అంతా ఎదురు చూస్తున్న సమయంలో ఆయన ఓ ట్వీట్ చేశారు. తన స్నేహితుడైన థాయ్ల్యాండ్ ప్రధానితో కరోనా గురించి చర్చించానని తెలిపారు. ఇరుదేశాలు కరోనా కట్టడికి కలిసికట్టుగా పని చేస్తాయని అన్నారు. చారిత్రిక, సాంస్కృత్రిక సంబంధాలున్న భారత్, థాయ్ల్యాండ్లు.. కరోనా మహమ్మారి విసురుతున్న సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కొంటాయని ఆయన ట్వీట్ చేశారు. కాగా.. లాక్ డౌన్ పొడిగించడంతో.. దేశ ప్రజలనుద్దేశించి ప్రతిదాని మోడీ మాట్లాడుతారని భావించారు. కానీ, ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. కాగా, కరోనా ప్రభావాణ్ని బట్టి మూడు జోన్లుగా విభజించి.. ఆయా ప్రాంతాలలో తీసుకోవలసిన చర్యల పట్ల కేంద్రం.. రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Discussed issues related to COVID-19 pandemic with good friend @prayutofficial. As neighbours with deep-rooted historical and cultural links, India and Thailand will work together to deal with the multifarious challenges posed by this present crisis.
— Narendra Modi (@narendramodi) May 2, 2020
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com