అంబులెన్స్లో కల్లు తరలింపు.. ఇద్దరు అరెస్టు

X
By - TV5 Telugu |2 May 2020 3:08 PM IST
అంబులెన్స్ ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడే వరప్రదాయిని. రోడ్లపై అంబులెన్స్ శబ్దం వినిపిస్తే ప్రతి ఒక్కరు తప్పుకుని దారిస్తారు. ఇటువంటి అంబులెన్స్ను కొందరు కల్లు తరలించడం కోసం వినియోగించారు. హైదరాబాద్ లో కొందరు వ్యక్తులు కల్లు తరలించడం కోసం అంబులెన్స్ను ఉపయోగించుకున్నారు. ఓ ప్రైవేటు అంబులెన్స్లో కల్లు తరలిస్తున్న ఇద్దరిని ఎస్సార్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు వ్యక్తులు రెండు క్యాన్లలో 30 లీటర్ల కల్తీ కల్లు తీసుకొని బేగంపేట చేరుకున్నారు. అక్కడి నుంచి అంబులెన్స్లో బల్కంపేట చేరుకున్నారు. పోలీసులు ఆ వాహనం సోదా చేయగా కల్లు తరలిస్తున్న విషయం బయటపడింది. దీంతో వారిని అరెస్టు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com