తెలంగాణ హైకోర్టు జడ్జిగా విజయ్సేన్ రెడ్డి
తెలంగాణ హైకోర్టు న్యాయముర్తిగా బి.విజయ్సేన్రెడ్డిని నియమిస్తూ కేంద్ర సర్కార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. శనివారం ఉదయం 11.30 గంటలకు విజయ్సేన్ రెడ్డి జడ్జిగా ప్రమాణం చేయనున్నారు. తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ శనివారం విజయ్సేన్రెడ్డితో ప్రమాణం చేయించనున్నారు. విజయ్సేన్రెడ్డి నియామకంతో హైకోర్టు జడ్జిల సంఖ్య 14కు చేరింది.
బి.విజయ్సేన్రెడ్డి 1970 ఆగస్టు 22న హైదరాబాద్లో జన్మించారు. తండ్రి జస్టిస్ బి.సుభాషణ్రెడ్డి ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా, మద్రాసు, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా, ఉమ్మడి రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్గా, లోకాయుక్తగా సేవలందించారు. 1994 డిసెంబరులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. రాజ్యాంగ, సివిల్, క్రిమినల్, సర్వీసు, భూసేకరణ, ఆర్బిట్రేషన్, పౌరసరఫరాలకు చెందిన కేసులను వాదించారు.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com