3 రోజులు బస్సుల్లో ఉచిత ప్రయాణం..

X
By - TV5 Telugu |4 May 2020 12:18 AM IST
లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు ఎక్కడివారక్కడ నిలిచిపోయారు. వారందరినీ సొంత ఊళ్లకు తరలించే ఏర్పాటు చేస్తోంది కర్ణాటక ప్రభుత్వం. ఇందులో భాగంగానే కేసీఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఈ సౌకర్యం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రాలు, బెంగళూరు నుంచి వలస కార్మికులు తమ ప్రాంతాలకు చేరుకోవచ్చని తెలిపారు. అయితే బస్సు స్టాపుల్లో పెద్ద సంఖ్యలో జనం గుమికూడకుండా చూసుకోమని అధికారులకు సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com