మళ్ళీ బేర్ గుప్పిట్లోకి... కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

X
By - TV5 Telugu |4 May 2020 5:20 PM IST
ప్రపంచ మార్కెట్ల సపోర్ట్ లేకపోవడంతో సోమవారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దీంతో 4 రోజుల వరుస లాభాలకు బ్రేక్పడినట్లయింది. ముఖ్యంగా మెటల్స్, బ్యాంకింగ్, ఆటో షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనవుతోన్నాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లోని అన్ని రంగాల సూచీలు నేలచూపులు చూస్తున్నాయి. నిఫ్టీ 9500 దిగువకు పడిపోయింది. ప్రస్తుతం నిఫ్టీ 418 పాయింట్ల నష్టంతో 9441 వద్ద, సెన్సెక్స్ 1453 పాయింట్ల నష్టంతో 32265 వద్ద ట్రేడవుతోన్నాయి. బ్యాంక్ నిఫ్టీ 1320 పాయింట్లు నష్టపోయి 20200కు సమీపంలో కొనసాగుతోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com