థాయిలాండ్లో తెరుచుకున్న 28 విమానాశ్రయాలు
కరోనా దెబ్బకి ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. ఈ కరోనా మహమ్మారి కట్టడి చేయడానికి ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించి అమలు చేస్తోంది. ఈ లాక్ డౌన్ నేపథ్యంలో పలు విమానాశ్రయాలు మూతపడ్డాయి. ఏప్రిల్ ప్రారంభం నుంచి థాయిలాండ్ ప్రభుత్వం విమానాల రాకపోకలపై నిషేదం విధించింది. మే ప్రారంభం నుంచి కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉండటంతో కర్ప్యూ నిబంధనలు సడలించారు. సామాజిక దూరం పాటిస్తూ మాస్క్లు ధరించడం తప్పని సరి చేశారు.
ఈ నేపథ్యంలో విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించినట్లు సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ థాయిలాండ్(సీఏఏటీ) పేర్కోంది. థాయిలాండ్లో మొత్తం 28 ఎయిర్పోర్టులకు అనుమతి ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మే 1వ తేదీ నుంచే కొన్ని విమానాలు నడుస్తున్నట్లు తెలిపింది. అయితే విమానాలు నడిపేందుకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు సీఏఏటీ డైరెక్టర్ జనరల్ వివరించారు.
ఎయిర్పోర్టుల్లోకి అత్యవసర, సాంకేతిక సిబ్బంది, మెడికల్ సిబ్బంది, స్వదేశాలకు వెళ్లే వారికి నడుపుతున్న ప్రత్యేక విమానాలు, కార్గో విమానాలు తప్పితే ఇతర ఎటువంటి అంతర్జాతీయ సర్వీసులు అనుమతించడం లేదని పేర్కొన్నారు. ప్రయాణికులందరికి విమానాశ్రయాల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com