వలస కార్మికుల రైళ్లు రద్దు.. ఎక్కడివారక్కడే..

వలస కార్మికుల రైళ్లు రద్దు.. ఎక్కడివారక్కడే..
X

కరోనా గొడవ కొంత తీరింది. ఇంక ఇప్పుడు మీ ఊరెళ్లి ఏం చేస్తారు. ఇక్కడే ఉండి పనులు చేసుకోండి అంటూ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప వలస కార్మికులను ఆపేస్తున్నారు. వారిని స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లను రద్దు చేశారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం కోవిడ్ నియంత్రణలో చాలా మెరుగ్గా ఉందని.. తీవ్రత ఉందని అనుమానించిన ఏరియాల్లో ఎలాగూ రెడ్‌జోన్ అమల్లో ఉంది. అలాంటి ప్రాంతాల్లో తప్పించి మిగతా చోట్ల భవన నిర్మాణ పనులు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. దీంతో కార్మికులకు పని దొరుకుతుంది.

ఇదే విషయమై రైళ్లను రద్దు చేయాలని కర్నాటక వలస కూలీల నోడల్ ఆఫీసర్ రైల్వేశాఖకు లేఖ రాశారు. రెండు రోజుల క్రితం బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద వేల మంది వలస కార్మికులు పని కల్పిస్తారా.. పంపిస్తారా అని ఆందోళన చేపట్టారు. దాంతో సీఎం నిర్మాణ రంగ ఏజెన్సీలతో చర్చలు జరిపారు. మెట్రో, బీఐఏఎల్ ప్రాజెక్టులతో మాట్లాడిన ఆయన పనులు జరిపేందుకు పచ్చజెండా ఊపారు. వెంటనే నిర్మాణ పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు. దాంతో ఈ రోజు బీహార్‌లోని ధన్‌బాద్‌కు వెళ్లాల్సిన మూడు రైళ్లను రద్దు చేశారు.

Tags

Next Story