దక్షిణ కాశ్మీర్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హతం

X
By - TV5 Telugu |6 May 2020 10:04 PM IST
దక్షిణ కాశ్మీర్ అవంతిపోరాలోని బీగ్పోరా ప్రాంతంలో మంగళవారం రాత్రి నుంచి భారీగా సెర్చ్ ఆపరేషన్ జరిగింది, ఇందులో కాశ్మీర్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ రియాజ్ నాయకూను భద్రతా దళాలు ఎన్ కౌంటర్ చేశాయి.
జమ్మూ కాశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం, ఆర్మీకి చెందిన 55 రాష్ట్రీయ రైఫిల్స్, సిఆర్పిఎఫ్ పోలీసులు బీగ్పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు గుర్తించాయి. అనంతరం భద్రతా సంస్థలు అప్రమత్తమై బీగ్పోరాలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. హిజ్బుల్ కమాండర్ భద్రతా దళాలు చిక్కుకున్నట్లు బుధవారం ఉదయం జమ్మూ కాశ్మీర్ పోలీసులు ధృవీకరించారు.
కాశ్మీర్లో అత్యంత చురుకైన కమాండర్గా ఉన్న రియాజ్ నాయకూను పట్టుకోవటానికి చేసిన ఆపరేషన్ భద్రతా సంస్థలకు పెద్ద విజయంగా భావిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com