అవసరమైతే కంపెనీని అక్కడ నుంచి తరలిస్తాం: ఏపీ సీఎం
By - TV5 Telugu |7 May 2020 5:53 PM GMT
విశాఖ ఘటనపై అధికారులు స్పందించిన తీరును సీఎం జగన్ అభినందించారు. ఘటన జరిగిన వెంటనే అధికారులు స్పందించారని.. ఉదయమే కలెక్టర్తో పాటు ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారని అన్నారు. 340మంది మందికిపైగా స్థానికులను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఎల్జీ కంపెనీలో ఇలాంటి ఘటన జరగటం దురదృష్టకరమన్న సీఎం జగన్.. అవసరమైతే ఈ పరిశ్రమను అక్కడనుంచి తరలించేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com