సింగరేణి కాలరీస్ రూ.40 కోట్లు.. లలితా జ్యువెలర్ రూ.1 కోటి

X
By - TV5 Telugu |7 May 2020 1:43 AM IST
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు, లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన సహాయ నిధికి విరాళాలు అందుతున్నాయి. తాజాగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ ప్రభుత్వానికి రూ.40 కోట్ల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును సింగరేణి సిఎండి ఎన్. శ్రీధర్ బుధవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు అందించారు. లలితా జ్యువెల్లర్స్ కూడా కోటి రూపాయల విరాళం అందించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలకు కూడా చెరో కోటి రూపాయల విరాళం అందిస్తున్నట్లు లలితా జ్యవెల్లర్స్ సిఎండి డాక్టర్ ఎం. కిరణ్ కుమార్ తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com