ఎల్జీ పాలిమర్స్ మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ
By - TV5 Telugu |11 May 2020 1:27 PM GMT
విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ జరిగింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారాన్ని మంత్రులు అందజేశారు. ప్రమాదంలో మరణించిన చిన్నారి గ్రీష్మ తల్లికి కూడా చెక్కును అందజేశారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు కన్నబాబు, బొత్స, అవంతి, ధర్మాన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది మృతి చెందారని అన్నారు. ముఖ్యమంత్రి జగన ఆదేశాల మేరకు చెక్కులు పంపిణీ చేశామని వెల్లడించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com