దేశవ్యాప్తంగా 70 వేల మార్క్కు చేరిన కరోనా కేసులు

X
By - TV5 Telugu |12 May 2020 5:25 PM IST
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు 70 వేల మార్కును దాటేశాయి. గడిచిన 24 గంటల్లో 3 వేల 604 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి 87 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 70 వేల 756కు చేరాయి. ఇప్పటివరకు 2 వేల 293 మంది చనిపోయారు. ప్రస్తుతం 46 వేల 8 యాక్టివ్ కేసులు ఉండగా.. 22 వేల 455 మంది డిశ్చార్జి అయ్యారు. ఈమేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com