అమెరికాలో నిరుపేదలకు ఆహారం పంపిణీ చేసిన తెలుగువారు

అమెరికాలో నిరుపేదలకు ఆహారం పంపిణీ చేసిన తెలుగువారు

అమెరికాలో కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వారికి తెలుగు సంఘం తమవంతు సహాయం అందించింది. అమెరికాలో ఉన్న ప్రవాస తెలుగువారు, భారతీయులకే కాకుండా నిరుపేదలకు సహయం చేస్తూ కొండంత అండగా నిలుస్తోంది నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ సంస్థ. న్యూజెర్సీలో లాక్ డౌన్ కారణంగా అవస్థలు పడుతున్న వారికి నాట్స్ వాలెంటీర్స్ ఉచితంగా ఆహరం అందించారు. న్యూ బ్రౌన్స్ విక్ లో నిరుపేదలకు పిజ్జా, వాటర్ బాలిట్స్, సాప్ట్ డ్రింక్ అందించారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వాటిని పంపిణీచేశారు.

Tags

Read MoreRead Less
Next Story