భక్తుల కోసం తిరుమల శ్రీవారి ద్వారాలు..

భక్తుల కోసం తిరుమల శ్రీవారి ద్వారాలు..

కరోనా వైరస్ నేపథ్యంలో కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా మునుపెన్నడూ లేని విధంగా మూత పడింది. గత కొన్ని రోజులుగా స్వామి వారికి ప్రత్యేక పూజలు తప్పించి భక్తులకు అనుమతి లేదు. త్వరలో భక్తులను అనుమతించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమవుతోంది. కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలను బట్టి దర్శనానికి భక్తులను అనుమతించాలనుకుంటోంది. దీనిపై తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.

కరోనా కట్టడి నిర్మూలను మాస్కులు, భౌతిక దూరం పాటించడం వంటి ముఖ్య చర్యలపై ఓ నిర్ణయానికి వచ్చిన టీటీడీ దర్శన విధానంలో మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గతంలోలా కాకుండా పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. క్యూ కాంప్లెక్స్‌లో భక్తులు వేచి వుండే విధానానికి తాత్కాలికంగా స్వస్తి పలకనున్నట్లు సమాచారం.

టైం స్లాట్ కింద వచ్చిన భక్తులకు వెంటనే శ్రీవారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేయనుంది. ట్రయిల్ కింద స్థానికులను దర్శనానికి అనుమతించనున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం సక్సెస్ అయితే తదుపరి దర్శన విధానంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలో భక్తులు శ్రీవారిని దర్శించుకోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story