బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న రెండు రోజుల్లో..

X
By - TV5 Telugu |14 May 2020 3:19 AM IST
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది మరింత బలపడి పెనుతుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు బుధవారం ఒక బులెటిన్ విడుదల చేశారు. దీని ప్రభావం కారణంగా వచ్చే శుక్ర, శని వారాల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ నికోబార్ దీవుల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బలమైన ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com