ఆందోళనకు గురవుతారని.. మృతి విషయం చెప్పలేదు: ఈటెల రాజేందర్
By - TV5 Telugu |21 May 2020 4:23 PM GMT
కరోనా లక్షణాలో ఆసుపత్రిలో చేరిన తన భర్త మిస్సయ్యాడంటూ.. మాధవి అనే గృహిణి మంత్రి కేటీఆర్కు చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. దీనిపై మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. ఆ కుటుంబంలో అప్పటికే మాధవి మామగారు చనిపోయారని.. ఆ మరుసటి రోజే భర్త కూడా చనిపోయారని అన్నారు. అప్పటికే కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో వున్న ఆ కుటుంబానికి ఈ వార్త తెలిస్తే మరింత ఆందోళనకు గురవుతారని.. మృతి విషయం చెప్పలేదని తెలిపారు. తామే అంత్యక్రియలు నిర్వహించామని అన్నారు ఈటెల.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com