మే25 నుంచి దేశవ్యాప్తంగా దేశీయ విమాన సర్వీసులు..

X
By - TV5 Telugu |21 May 2020 12:55 AM IST
దేశీయ విమాన సర్వీసులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 25 నుంచి దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించినట్టు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. సర్వీసుల పునరుద్ధరణపై ఆపరేటర్లకు.. సమాచారం ఇచ్చినట్టు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ప్రయాణికులు కేంద్రం నిర్దేశించిన వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అటు ఆరోగ్య పరీక్షల తర్వాతే విమానాశ్రయాల్లోకి ప్రయాణికుల అనుమతిస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను త్వరలోనే కేంద్రం విడుదల చేయనుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com