లాక్డౌన్ 5.0.. జూన్ 30 వరకు..
దేశ వ్యాప్తంగా లాక్డౌన్ 4.0 కొనసాగుతోంది. కొన్ని సడలింపులతో కొనసాగుతున్న లాక్డౌన్ని దాదాపుగా ప్రజలు లాక్డౌన్లో ఉన్నామనే విషయాన్నే మర్చిపోయారు. ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్ లాక్డౌన్ 5.0ను ప్రకటించింది. ఇది వచ్చే నెల జూన్ నెలాఖరు వరకు కొనసాగుతుందని బీజేపీ నేతృత్వంలోని జైరాం ఠాకూర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఈ లాక్డౌన్ కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 210 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 63 మంది కోలుకుంటే అయిదుగురు మరణించారు. ఒక్క హమరిపూర్ జిల్లాలోనే 63 కేసులు నమోదయ్యాయి. మరొక జిల్లా సోలన్లో 21 జిల్లాలు నమోదయ్యాయి. లాక్డౌన్ పొడిగిస్తారనే అనుమానం వ్యక్తం చేసిన హిమాచల్ వాసుల అనుమానాలను నిజం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com