రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి చినజీయర్ స్వామీజీని ఆహ్వానించిన సీఎం
![రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి చినజీయర్ స్వామీజీని ఆహ్వానించిన సీఎం రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి చినజీయర్ స్వామీజీని ఆహ్వానించిన సీఎం](http://tv5site.vocalwire.com/wp-content/uploads/2020/05/kcr-meets-chinajiyar-swamu.png)
కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి త్రిదండి చినజీయర్ స్వామీజీని ఆహ్వానించారు ముఖ్యమంత్రి కేసీఆర్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ జీయర్ ఆశ్రమానికి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మంత్రులు శ్రీనివాస్ గౌడ్ , నిరంజన్ రెడ్డి ఆశ్రమానికి వెళ్లారు. ఆశ్రమంలో గంటపాటు చినజీయర్ స్వామీజీతో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవంతో పాటు యాగానికి రావాల్సిందిగా చినజీయర్ స్వామీజీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్కు చినజీయర్ స్వామీజీ మంగళాశాసనాలు అందజేశారు.
శుక్రవారం ఉదయం 7 గంటలకు కొండపోచమ్మ ఆలయంలో కేసీఆర్ పూజలు నిర్వహిస్తారు. అదే సమయంలో ఛండీయాగం, సుదర్శనయాగం, గంగమ్మ పూజలు చేస్తారు. ఛండీయాగం పూర్ణాహుతిలో కేసీఆర్ దంపతులు పాల్గొంటారు. అనంతరం కొండపోచమ్మ సాగర్ పంప్ హౌస్ను ప్రారంభిస్తారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com