కరోనా ఎఫెక్ట్ : యూఎన్-కాప్26 సమావేశం 2021కి వాయిదా

కరోనా ఎఫెక్ట్ : యూఎన్-కాప్26 సమావేశం 2021కి వాయిదా

ప్రపంచంలో ఇప్పటివరకు 59 లక్షల 10 వేల 145 మందికి వ్యాధి సోకింది. 25 లక్షల 83 వేల 502 మంది కోలుకున్నారు. మరణాల సంఖ్య 3 లక్షల 62 వేల 114 కు పెరిగింది. అయితే తీవ్రమైన కరోనా అంటువ్యాధిని దృష్టిలో ఉంచుకుని ఐక్యరాజ్యసమితి వాతావరణంపై ప్రపంచ శిఖరాగ్ర సమావేశం(COP 26) ను ఒక సంవత్సరం పాటు వాయిదా వేయాలని నిర్ణయించింది. ఈ సమావేశం ఈ ఏడాది నవంబర్ 9 నుండి గ్లాస్గోలో జరగాల్సి ఉంది. అయితే కరోనావైరస్ కారణంగా ఇది ఇప్పుడు 2021 నవంబర్‌లో జరుగుతుందని బ్రిటన్ బిజినెస్ సెక్రటరీ, కాప్ 26 సమ్మిట్ అధ్యక్షుడు అలోక్ శర్మ శుక్రవారం చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story