జూన్ 6 వరకు కోర్టులకు లాక్డౌన్
By - TV5 Telugu |29 May 2020 7:28 PM GMT
కరోనా నేపథ్యంలో కోర్టులు, ట్రిబ్యునళ్ల లాక్డౌన్ను వచ్చే నెల 6 వ తేదీ వరకు పొడిగించింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. అత్యవసర కేసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని జిల్లా కోర్టులకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మినహా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఆన్లైన్లో కానీ నేరుగా కానీ పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చని చెప్పింది. కోర్టుల్లో మాస్కులు, శానిటైజేషన్ వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com