ఎందుకలా రాస్తారు.. అక్షయ్ ఫైర్..

కొందరు వ్యక్తులు ఆ పని చేశారంటే అస్సలు నమ్మం. వారిపై ఉన్న అభిమానం అలాంటిది. స్వార్థ ప్రయోజనాలను పక్కన పెట్టి సమాజ శ్రేయస్సును కోరే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఆ పని చేశాడంటే అసలు నమ్మరు అభిమానులు. కానీ ఆయనకు కోపం తెప్పించే పోస్ట్ ఒకటి పెట్టి అక్షయ్ని ఆగ్రహానికి గురి చేశారు. ఆ వార్త సారాంశం.. అక్షయ్ తన సోదరి అల్కా భాటియా, ఆమె ఇద్దరు పిల్లలు సురక్షితంగా దిల్లీ వెళ్లేందుకు ఓ విమానం ప్రత్యేకంగా బుక్ చేశారని ఇటీవల ఓ వెబ్సైట్లో వార్తలు వచ్చాయి.
ఆ వార్త చూసిన అక్షయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వార్తల్లో నిజం లేదు. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి తన సోదరి ఎలాంటి ప్రయాణాలు చేయలేదని చెప్పారు. అయినా ఆమెకు ఒక్కరే సంతానం. వార్తలు రాసే ముందు నిజానిజాలు తెలుసుకుని రాయడం మంచిది. ఏది పడితే అది రాయకూడదు అని అన్నారు. అవాస్తవాలు ప్రచురిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. అక్షయ్ ట్వీట్తో సదరు వెబ్సైట్ ఆ వార్తను తొలగించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com