విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ

బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి బ్రిటన్లో తలదాచుకున్న మాల్యాను రప్పించేందుకు.. కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 11 వేల కోట్లకుపైగా రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్షియంను మోసం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు మాల్యా. ఈ నేపథ్యంలో మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు బ్రిటన్ ప్రభుత్వంతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం.
ఇదిలావుంటే, భారత్కు రాకుండా తప్పించుకునేందుకు మాల్యా చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. భారత్లోని బ్యాంకులను మోసగించినట్లు నమోదైన ఆరోపణలపై విచారణను ఎదుర్కోవడం కోసం.. విజయ్ మాల్యాను భారత్కు అప్పగించాలని క్రింది కోర్టు రూలింగ్ ఇచ్చింది. దీనిపై ఆయన యునైటెడ్ కింగ్డమ్లోని రెండో అత్యున్నత న్యాయస్థానం లండన్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హైకోర్టు ఆయన అప్పీలును తోసిపుచ్చింది. అటు సుప్రీం కోర్టులోనూ అప్పీలు చేసుకునేందుకు మాల్యాకు అనుమతి లభించలేదు.
మాల్యా చేసుకున్న ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో.. అతన్ని స్వదేశానికి రప్పించే ప్రయత్నాలను వేగవంతం చేసింది భారత్. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వంతో భారత్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే, మాల్యా.. తాను నూటికి 100 శాతం రుణాలను తిరిగి చెల్లిస్తానని, తనపై కేసును ముగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు .
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

